బెజవాడ టీడీపీలో తమ్ముళ్ల ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది.ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా నాయకుల మధ్య సమైక్యత కనిపించడం లేదు.
కార్పొరేషన్ రేసులో ముందున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత.మేయర్ అభ్యర్థిగా కూడా ప్రచారంలో ఉన్నారు.
అయితే.తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేశినేనికి ఇతర నేతలకు మధ్య గ్యాప్ చాలా పెరిగింది.
ఆయన పార్టీ నేతలను టార్గెట్ చేయడంతోపాటు.కీలక నేతగా ఉన్న విజయవాడ టీడీపీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ.
బుద్ధా వెంకన్న ను టార్గెట్ చేశారు.అదేసమయంలో ఇతర నేతలను కూడా ఆయన పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా వంగవీటి రాధా, బొం డా ఉమా వంటి నాయకులను కూడా పక్కన పెట్టారు.
ఈ ఎఫెక్ట్ బాగానే కనిపిస్తోంది.మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకుషెడ్యూల్ విడులైన వెంటనే ప్రచారం ప్రారంబించిన కేశినేని తన కుమార్తె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు.
తానే స్వయంగా జెండా చేతపట్టి ప్రచారంలోకి దిగారు.అయితే.
ఆయన వెంట కీలక నేతలు ఎవరూ లేక పోవడం గమనార్హం.అయితే.
మీడియాను సమీకరించి.తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు.