నేటి నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు నో పర్మిషన్‌..!

హైదరాబాద్ : జూన్ 05నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు అనుమతి లేదు.

ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటన చేసింది.లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువు దీరబోతోంది.

కొత్త ప్రభుత్వం కొలువుదీరే ప్రక్రియ రాష్ట్రపతి భవన్‌లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలోనే జరగనుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర నూత న మంత్రిమండలి ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు మొద లయ్యాయి.

ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు.

కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!