నితిన్ సినిమా కూడా ఓటీటీలోకి రావాల్సిందేనా

కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు ఇన్ని రోజులు థియేటర్ లో రిలీజ్ కోసం వేచి చూసాయి.

అయితే పరిస్థితులు రోజురోజుకి మరింత క్షీణిస్తూ ఉండటంతో ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదని నిర్ణయానికి వచ్చేశారు.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఒటీటీ బాట పట్టారు.ఇప్పటికే సౌత్ లో చిన్న సినిమాలు అన్ని ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి.

ఇక బాలీవుడ్ లో లక్ష్మి బాంబ్, శకుంతలాదేవి లాంటి పెద్ద సినిమాలు కూడా ఓటీటీనే నమ్ముకున్నాయి.

ఇక ఒటీటీలో సినిమాలకి కూడా మంచి ఆదరణ వస్తుంది.ఇప్పటి వరకు డిజిటల్ చానల్స్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలు ఎంతో కొంత వరకు లాభాలతోనే బయట పడ్డాయి.

ఈ నేపధ్యంలో సౌత్ దర్శక, నిర్మాతలు కూడా తప్పనిసరి పరిస్థితిలో ఓటీటీనే నమ్ముకున్నారు.

అనుష్క నిశ్శబ్దం, నాని వి మూవీ, సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాలు ఒటీటీలో రిలీజ్ కి రెడీ అయ్యాయి.

ఈ సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి.ఇవన్ని కూడా మంచి బజ్ ఉన్న సినిమాలే కావడం విశేషం ఇప్పుడు ఇదే దారిలో నితిన్ కూడా నడిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ నటించిన సినిమా రంగ్ దే.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉంది.మరో 10 పర్సెంట్ షూటింగ్ పూర్తి చేస్తే గుమ్మడికాయ కొట్టేస్తారు.

ఈ నేపధ్యంలో అది కూడా పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాను కూడా నిర్మాతలు ఓటీటీలో విడుదల చెయ్యాలనుకుంటున్నారు.త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం రిలీజ్ రైట్స్ విషయంలో ఒటీటీతో సంప్రదింపులు జరుగుతున్నాయి.

హాట్ ఫోటో షూట్ లో అందాలు ఒలకబోస్తూ ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్..