నాని హీరోయిన్ను లైన్లో పెట్టిన భీష్మ
TeluguStop.com
యంగ్ హీరో నితిన్ ఇటీవల భీష్మ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమా నితిన్ కెరీర్లో బ్లాక్బసర్ట్ హిట్గా నిలవడంతో అదే జోష్తో తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే రంగ్దే సినిమా షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటోన్న నితిన్ మరో సినిమాను లైన్లో పెట్టేందుకు సిద్ధమయ్యాడు.
బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయిన ‘అందాధున్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు నితిన్ రెడీ అయ్యాడు.
ఈ క్రమంలో నితిన్ సరసన హీరోయిన్గా ప్రియాంకా ఆరుల్ మోహన్ను ఎంపిక చేశాడట.
నాని నటించిన జెంటిల్మెన్ చిత్రంలో తన నటనతో మెప్పించిన ప్రియాంకా ఆరుల్ మోహన్ అయితే ఈ సినిమాలో పర్ఫెక్ట్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావించింది.
దీంతో వెంటనే ఆమెను ఈ సినిమాకు ఓకే చేశారట.ఇక ఈ సినిమాను లాక్డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
మరి నితిన్తో ప్రియాంకా కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ఈమె ఆస్ట్రేలియాలోనే అత్యంత ధనికురాలు.. తన పెయింటింగ్ ఎవరూ మెచ్చడం లేదని..?