టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్న హీరోహీరోయిన్లు

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగ్‌దే ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మరోసారి నితిన్ తన సక్సె్స్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో నితిన్, కీర్తి సురేష్‌ల మధ్య చాలా సరదా ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వారి మధ్య జరిగిన ఓ ఫన్నీ మూమెంట్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

హీరో నితిన్ తీవ్రంగా కష్టపడుతుంటే, హీరోయిన్ కీర్తి సురేష్ నిద్రపోతుందంటూ ఓ ఫోటోను చిత్ర యూనిట్ సరదాగా ట్వీట్ చేసింది.

అయితే ఈ ఫోటోపై కీర్తి సురేష్ కూడా తనదైన రీతిలో కామెంట్ చేసింది.

నేను పడుకోవడం మీకు అసూయగా ఉంది కదా అంటూ కీర్తి సురేష్ ట్వీట్ చేయడంతో ఈ ఫోటోపై హీరోహీరోయిన్లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుతున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోండగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లకు మంచి రెస్పాన్స్ లభించింది.

మరి ఈ రంగ్ దే చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

కాగా కీర్తి సురేష్ ఇప్పటికే వరుసబెట్టి చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.

ఇదేంటి జగనన్నా… మ్యానిఫెస్టో షాక్ ఇచ్చిందిగా..?