అలా జరిగితే నేను బ్రతకలేను.. నిరుపమ్ భార్య కామెంట్స్ వైరల్..?

కార్తీకదీపం సీరియల్ ద్వారా నిరుపమ్ పరిటాల ఆయన భార్యగా మంజుల పరిటాల ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే.

రీల్ లైఫ్ లో ఎలాంటి పాత్రలోనైనా నటించే మంజుల రియల్ లైఫ్ లో మాత్రం సరదాగా ఉంటారు.

ఇద్దరూ బుల్లితెర నటులే కావడంతో బుల్లితెర ప్రేక్షకులకు నిరుపమ్, మంజులను ప్రత్యేకంగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

నిరుపమ్, మంజుల సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మంజుల అలా జరిగిన రోజు తాను బ్రతకను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మధ్య కాలంలో సీరియళ్లలో పెద్దగా యాక్టివ్ గా లేని మంజుల త్వరలో హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ తో ఎంట్రీ ఇవ్వనున్నారు.

తాజాగా నెటిజన్లు నిరుపమ్, మీరు ఎప్పుడు కలిసి నటిస్తారని అడగగా హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ లో నటిస్తామని మంజుల పేర్కొన్నారు.

డాక్టర్ బాబు, హిట్లర్ లలో ఎవరు ఇష్టమని అడగగా హిట్లర్ అని మంజుల సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్, బెంగళూరులలో ఏ సిటీ అంటే ఇష్టమని అడగగా తనకు బెంగళూరు అంటే ఇష్టమని ఆమె వెల్లడించారు.

"""/"/ ఒక నెటిజన్ భర్త నిరుపమా.? కొడుకు రికీనా అని అడగగా వాళ్లు తనకు హార్ట్, హార్ట్ బీట్ అని ఆ రెండింటినీ వేరు చేయలేమని మంజుల అన్నారు.

ఒకవేళ ఆ ఇద్దరినీ వేరు చేయాల్సిన పరిస్థితి వస్తే తన ఊపిరి ఆగిపోతుందంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

"""/"/ వాళ్లు లేకపోతే తాను బ్రతకలేనని మంజుల చెప్పుకొచ్చారు.మంజుల చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె సమాధానాలను విని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

భర్త, కొడుకులలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని మంజుల వెల్లడించడం గమనార్హం.

కెనడా గురించి షాకింగ్ కామెంట్లు చేసిన కంటెంట్ క్రియేటర్.. వీడియో వైరల్..