బలవంతపు ఏకగ్రీవలు చేస్తే హౌస్ అరెస్టు చేస్తాం: ఎస్ఈసి
TeluguStop.com
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు.వీరిద్దరు ఓ నెల రోజుల నుండి ఢీ అండ్ ఢీ అన్నట్లుగా ఉన్నారు.
ఒక్కరి చేతిలో రాష్ట్రమే ఉంటే.మరోకరి చేతిలో మాత్రం ఆ ప్రభుత్వాని నడిపించే అధికార పవర్ ఉంది.
పంచాయతీ ఎన్నిక షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అధికార ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది.
పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం కోసం ప్రకటనలు ఇస్తుంది.ఈ విషయాన్ని ఎస్ఈసి సీరియస్ గా తీసుకుంది.
మాకు తెలియకుండా ఏకగ్రీవల కోసం ఎలా ప్రకటనలు ఇస్తారు అంటూ మండి పడింది.
ఏకగ్రీవలు అనేవి మంచివే అవి సామరస్య పూర్వకంగా ఉండాలి అన్నాడు.కానీ భేదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం ప్రజస్వామ్యం కు మంచిది కాదు అన్నాడు.
ఏకగ్రీవాలకోసం ప్రకటనలు ఇచ్చిన అధికారులను వివరణ ఇవ్వవలిసింది కోరాం అన్నాడు.ఎన్నికల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, బెదిరించి, బందించి, ఎవరైతే రాజకీయాలు చేస్తారో వారిపై నిఘాపెట్టాలని, అలాంటి వారిని హౌస్ అరెస్టు చేయాలని అధికారులకు, పోలీసు లకు చెప్పడం జరిగిందని అన్నాడు.
ఏకగ్రీవాల కోసం పార్టీ ముఖ్యనేతలను, రాష్ట్ర గవర్నర్ లను కలవడం జరిగిందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నాడు .