'కార్తికేయ 2' నార్త్ ప్రేక్షకులను మెప్పించడానికి కారణం అదేనా?

కార్తికేయ 2 పేరు ఇప్పుడు దేశం అంతటా మారుమోగి పోతుంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2.

నిఖిల్ కెరీర్ లోనే కార్తికేయ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.

ఇక ముందు నుండి కూడా ఆడియెన్స్ కార్తికేయ 2 పై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేస్తుంది.

అక్కడ మార్కెట్ లో కార్తికేయ 2 కు భారీ డిమాండ్ నెలకొంది.సౌత్ నుండి అది కూడా మన టాలీవుడ్ నుండి మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా రావడంతో అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుంది.

అక్కడి పెద్ద సినిమాలను కూడా పట్టించు కోకుండా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

"""/" / రోజురోజుకూ స్క్రీన్ లు పెంచుకుంటూ పోతున్నారు.మన సౌత్ లో కూడా ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించలేదు.

మరి అంతలా నార్త్ ప్రేక్షకులను అలరించడానికి కారణం ఏంటా అని అందరు ఆరా తీస్తున్నారు.

శ్రీకృష్ణుడి రహస్యాల నేపథ్యంలో తెరకెక్కడం వల్ల ఈ సినిమా మరింత ఆకట్టుకుంటుంది అని చెబుతున్నారు.

ఉత్తరాది ప్రజలు ఎక్కువుగా కృష్ణుడిని ఆరాధిస్తారు.మరి ఈ సినిమాలో కృష్ణుడి ఔనత్యాన్ని చాటి చెప్పే ఒక సీన్ కూడా ఉంది.

ఆ సీన్ కారణంగానే అక్కడి ప్రేక్షకులు సినిమాను చూస్తున్నారని.ఇది ఒక సినిమాకు సీక్వెల్ అని కూడా అక్కడి వారికి తెలియదు అని అంటున్నారు.

మొత్తానికి ఉత్తరాది ప్రజల కారణంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటిగా చేరిపోయింది.

ఇదే స్పీడ్ కొనసాగితే పెట్టుబడికి డబల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఓరి దేవుడా.. ఇలా తయారయ్యారు ఏంట్రా.. గంజాయిని మిల్క్ షేక్ అంటూ..?!