పాన్ ఇండియాలో మరోసారి సంచలనం సృష్టించబోతున్న నిఖిల్….

తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే మన సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ లను సాధిస్తున్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమా( Indian Cinema ) ఇండస్ట్రీ లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవెల్ లో ఉందని చెప్పాలి.

ఇక దానికి అనుకూలంగానే మన హీరోలు కూడా మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే ప్రతి హీరో కూడా తమదైన రీతిలో తమ ఫ్యాన్స్ కి నచ్చే విధంగా సినిమాలు చేస్తూనే యూనివర్సల్ సబ్జెక్టుతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియాలో మంచి విజయాలను అందుకుంటున్నారు.

"""/" / ఇక యంగ్ హీరోల విషయానికొస్తే వాళ్ళు కూడా మంచి సబ్జెక్ట్ లతో సినిమాలు చేస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ముఖ్యంగా ఈ విషయం లో మనం నిఖిల్( Nikhil ) ని మెచ్చుకోవాలి.

ఆయన ' కార్తికేయ 2'( Kartikeya 2 ) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన మార్కెట్ ను భారీగా విస్తరించుకున్నాడు.

నిజానికి తెలుగుకు మాత్రమే పరిమితమైన నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఆయన 'స్వయంబు'( Svayambu ) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

"""/" / ఇక ఆయన సినిమాల కోసం పాన్ ఇండియాలోని ప్రేక్షకులు కూడా అమితంగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియాలో తన సక్సెస్ ల పరంపరను కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక స్వయంబు సినిమా కూడా ఒక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతుండటం వల్ల ఈ సినిమా కోసమే నిఖిల్ చాలా వరకు కసరత్తులను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

సీడెడ్ లో సంచలనాలు సృష్టించిన దేవర.. ఎన్టీఆర్ మాత్రమే ఏకైక హీరో అంటూ?