నిఖిల్ కూడా పెంచేసాడుగా.. కార్తికేయ 2 క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న యంగ్ హీరో!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ముందు నుండి నిఖిల్ విభిన్న సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాడు.ఈయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు కార్తికేయ వంటి సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

ఈ తర్వాత ఈయన పేరు దేశం అంతటా మారుమోగి పోయింది.ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిఖిల్ నెక్స్ట్ రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ సినిమాల బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.

ఇలా ఈయన సినిమాలకు డిమాండ్ ఏర్పడడంతో ఇప్పుడు రెమ్యునరేషన్ ను పెంచేసినట్టు టాక్ వినిపిస్తుంది.

ఏ హీరో అయినా సక్సెస్ రేట్ ఉన్నప్పుడే డిమాండ్ చేస్తూ ఉంటారు.ఇక ఇప్పుడు నిఖిల్ కూడా కార్తికేయ తో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది.

ఈయన కొత్త సినిమాలకు 8 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

అయినా కూడా నిర్మాతలు ఓకే చెబుతున్నారని సమాచారం.నిఖిల్ త్వరలోనే 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాలో కూడా కార్తికేయ జోడీ నే కనిపించ బోతుంది.దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

"""/"/ కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్నాడు.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుంది.

మరి ఈ సినిమాతో సక్సెస్ కొనసాగిస్తాడో లేదో చూడాలి.

సాయంలోనూ బాహుబలి.. ఆ రేంజ్ లో విరాళం ప్రకటించిన ప్రభాస్ ను మెచ్చుకోవాల్సిందే!