కార్తికేయ ఫైనల్‌ గా సైలెంట్‌ అయ్యాడు.. ఫైనల్‌ గా ఎంతంటే!

నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

10 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలను సొంతం చేసుకుంది.

ఆగస్టు 13వ తారీఖున థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో మంచి వసూళ్లని సొంతం చేసుకుంటూనే ఉంది.

ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి.సెప్టెంబర్ 30వ తారీఖున ఈ సినిమా ని స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయట.

ఇక ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన వసూళ్ల విషయానికి వస్తే 125 కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని.

అందులో 80 కోట్లకు పైగా షేర్ ఉందంటూ సమాచారం అందుతుంది.బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ కి దాదాపుగా 6 రెట్ల అధిక వసూళ్లను ఈ సినిమా దక్కించుకుందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతంలో మరియు సౌత్ లో ఇతర రాష్ట్రాల్లో మంచి వసూలను నమోదు చేసింది.

ప్రస్తుతం కేరళలో ఈ సినిమా డీసెంట్‌ వసూళ్ల ను రాబడుతూ దూసుకెళ్తుందట.సెప్టెంబర్ 30 వరకు మరో ఐదు నుండి 10 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కనుక ఈ సినిమా మరింతగా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టనుంది.సినిమా ఓటీటీలో అప్పుడే విడుదల చేయొద్దు అంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొందరు మాత్రం థియేటర్లలో సినిమా ఇంకా చూడలేదు ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

సెప్టెంబర్ 30 తో వారి ఎదురు చూపులకు తెరపడే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ గెలుపు మాకు చాలా స్పూర్తినిస్తుంది అంటున్న బాలీవుడ్ నటుడు…