నిహారిక పెళ్ళికి హాజరుకానున్న సెలబ్రెటీలు వీళ్లే!

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నిహారిక పెళ్లి గురించి బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల మరో నాలుగు రోజులలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

అయితే వీరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రాజస్థాన్ ఉదయపూర్ లో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.

ఇప్పటికే పెళ్లి పనులు పూర్తవడంతో మెగా కుటుంబ సభ్యులు అందరూ ఉదయపూర్ కు చేరుకున్నారు.

తాజాగా నిహారిక ఫ్రీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా మెగా కుటుంబ సభ్యులు ఉదయపూర్ కు చేరుకుని ఎంతో సందడి చేస్తున్నారు.

అయితే చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మినహా అందరూ ఉదయపూర్ కి చేరుకున్నారు.

వీరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఉదయపూర్ కి వెళ్ళలేదు.

సోమవారం ఉదయం కళ్ళ కుటుంబ సభ్యులతో అందరూ పెళ్లి వేడుకలలో పాల్గొననున్నట్లు సమాచారం.

నిహారిక పెళ్లి బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి తీసుకోవడం ద్వారా కరోనా కారణం వల్ల కేవలం కుటుంబ సభ్యులు, మరికొంత మంది సెలబ్రెటీలను ప్రత్యేకంగా ఫోన్ ద్వారా చిరంజీవి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అయితే సీనియర్ హీరోలైనా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి వారికి చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ ద్వారా పిలిచినట్లు సమాచారం.

వీరు మాత్రమే కాకుండా రానా, నితిన్, రామ్, నాగ చైతన్య, సమంత దంపతులతో పాటు పూజా హెగ్డే, రష్మికను కూడా వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

వీరితో పాటు ప్రముఖ దర్శకులు కొరటాల శివ, కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు ఆర్కే మీడియా, మైత్రి మూవీస్ మేకర్, దిల్ రాజు, దానయ్య, సురేష్ బాబు వంటి నిర్మాతలకు కూడా వివాహ ఆహ్వానం అందినట్లు సమాచారం.

నాగబాబు ముద్దుల తనయ నిహారికకు పెళ్లి లాంఛనంగా నాగబాబు దాదాపు పది కోట్ల రూపాయలను నిహారికకు ఇస్తున్నట్లు సమాచారం.

అక్కడ యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.. ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!