సమ్మర్ కోసం ఎదురుచూస్తున్న నిహారిక. ఎందుకంటే..?
TeluguStop.com
సాధారణంగా సమ్మర్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తుంటారు.సమ్మర్ లో పరీక్షలు పూర్తై సెలవులు రావడం వల్ల ఎంజాయ్ చేయొచ్చని విద్యార్థులు భావిస్తారు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా తమ సినిమాలను సమ్మర్ లోనే విడుదల చేయడానికి ఆసక్తి చూపుతారు.
అయితే మెగా డాటర్ నిహారిక కూడా తాను సమ్మర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని వెల్లడించారు.
గతేడాది జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న నిహారిక సమ్మర్ కోసం ఎదురు చూడటానికి ముఖ్యమైన కారణమే ఉంది.
"""/"/
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య టీజర్ నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
యూట్యూబ్ లో ఈ టీజర్ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.టీజర్ విడుదలైన తర్వాత ఈ ఏడాది మే 13వ తేదీన ఆచార్య సినిమాను విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.
టీజర్ చూసిన నిహారిక ట్విట్టర్ ద్వారా టీజర్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆచార్య టీజర్ ఫంటాస్టిక్ గా ఉందని సమ్మర్ కోసం తాను ఎదురు చూస్తున్నానని నిహారిక పేర్కొన్నారు.
మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా ఆచార్య మూవీ టీజర్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కొరటాల శివ డైరెక్షన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
65 సంవత్సరాల వయస్సులో చిరంజీవి ఎనర్జీని చూసి ఫ్యాన్స్ సైతం అవాక్కవుతున్నారు.ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం.
సినిమాలో రామ్ చరణ్ పాత్ర 40 నిమిషాలు, పూజా హెగ్డే పాత్ర 20 నిమిషాలు ఉండనుందని సమాచారం.
“యానిమల్” తెలుగు డబ్బింగ్ కోసం రాకేందు మౌళి ఎంత కష్టపడ్డాడో తెలుసా..