రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలానే ఉన్నాడేమో.. పవన్ గెలుపుపై నిహారిక కామెంట్స్ వైరల్!
TeluguStop.com
మెగా డాటర్ కొన్ని కొణిదెల నిహారిక ( Konidela Niharika )గురించి మనందరికీ తెలిసిందే.
మొన్నటి వరకు వరుసగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలిచిన నిహారిక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్ గా కనిపిస్తుంది.
అయితే ఈమె సినిమాల ద్వారా కంటే పెళ్లి విడాకుల విషయంలో బాగా హైలైట్ అయింది అని చెప్పవచ్చు.
ఇటీవలె నిహారిక విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.దాంతో నిహారికపై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు అభిమానులు.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను మరోసారి బయట పెట్టింది.
"""/" /
ప్రస్తుతం సినిమాలు, సిరీస్లు( Movies , Series ), అలాగే నిర్మాతగా బిజీగా ఉన్న నిహారిక తాజాగా కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను నిర్మించారు.
ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆహా ఓటీటీ సంస్థ నిర్వహిస్తున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో ఆమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మాట్లాడుతూ.
నేను ఎప్పుడు వచ్చేది నెక్స్ట్ సీజనా? అని నిహారిక అడగగా ఆ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్ ( Sudigali Sudheer )మీకేంటండి.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలుకా అని అన్నాడు.దాంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గెలిచిన తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్న వీడియోను ప్లే చేశారు.
"""/" /
కల్యాణ్ గారి సక్సెస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అని అడగగా.
యుద్థం గెలిచిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలానే ఉన్నదేమో అనిపించిందీ అని తెలిపింది నిహారిక.
పవన్ కళ్యాణ్ ను నిహారిక రాముడితో పోల్చడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ప్రస్తుతం నిహారిక మాటలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.పవన్ గెలుపు తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించిన వీడియో అందరినీ ఆకట్టుకుంది.
మెగా అభిమానులు ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ నన్ను బ్యాడ్ చేశాడు.. వైరల్ అవుతున్న సోనియా షాకింగ్ కామెంట్స్!