ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన నిహారిక కొణిదల...

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో మొక్కలు నాటిన నిహారిక కొణిదల.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.

మా నాన్న గారు నాగబాబు గారు ఎప్పుడు ప్రకృతి ని ప్రేమించాలని మొక్కలు పెంచాలని చెబుతూ ఉంటారని , ఈ ప్రపంచం లో అందరిని కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని ఆ ప్రకృతి ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిరంతరం కొనసాగడం చూస్తూ ఉన్నానని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ వారితో మొక్కలు నాటించడం మంచి కార్యక్రమం అన్నారు.

ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.ఈ అవకాశం కల్పించిన MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

వైరల్: షాపులో వింత ప్రచారం.. ఆ నోట్లకు వస్తువులు అమ్మబడవు అంటూ..