సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న నిహారిక.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
మామూలుగా ఇప్పుడంతా సోషల్ మీడియానే నడుస్తుంది.సామాన్యులతో పాటు మంచి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.
ప్రతి విషయాన్ని పంచుకోటానికి, కాలక్షేపం చేయటానికి సోషల్ మీడియా బాగా అందుబాటులో ఉంది.
ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు మాత్రం సమయం దొరుకుతే చాలు సోషల్ మీడియాలోనే ఉంటారు.
అయితే ఎప్పుడు నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే వాళ్లు ఒకేసారి ఎటువంటి అప్డేట్ లేకుండా మౌనంగా ఉంటే రకరకాల అనుమానాలకు దారితీస్తూ ఉంటాయి.
అయితే తాజాగా మరొ నటి నిహారిక కొణిదెల కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి, మెగా వారసురాలు నిహారిక కొణిదెల.
ఇక ఈమె గురించి అందరికీ తెలిసిందే.మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న కొణిదెల ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ మెగా ప్రిన్సెస్ ఇండస్ట్రీలో ఓ గుర్తింపును సంపాదించుకుంది.
కానీ వెండితెరపై ఈమెకు అంతగా కలిసి రాలేదు.దీంతో కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది నిహారిక.
తర్వాత అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.దీంతో ఏమి చేయలేక నటనకు దూరంగా ఉంటూ నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
అలా పలు వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకుంది.
ఇక పెద్దలకు నచ్చిన వ్యక్తి.ప్రముఖ వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్యను కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లి తర్వాత మాత్రం మరింత యాక్టివ్ గా మారింది.ముఖ్యంగా తన వేషధారణ మాత్రం పూర్తిగా మారింది.
సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తూ ఉంటుంది.
పైగా బాగా గ్లామర్ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.
తన హాట్ హాట్ లుక్ లతో అందర్నీ ఫిదా చేస్తుంది.తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
"""/"/
బాగా ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది.ఇక మెగా వారి ముద్దుల కూతురు కాబట్టి చాలా ఫ్రీడమ్ దొరకడంతో నెగిటివిటీని మూటగట్టుకుంది.
దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియా లైఫ్ కూడా దూరం అయింది.గతంలో తన జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది.
అంతేకాకుండా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కి మెగా ఫామిలీ పరువు తీసింది.
దీంతో నెగిటివిటీ రావటంతో కొన్ని రోజులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండగా మళ్లీ తను రిఫ్రెష్ అయి అడుగు పెట్టింది.
ఇక అప్పటి నుంచి మళ్ళీ తన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
"""/"/
పొట్టి పొట్టి బట్టలతో మళ్ళీ దర్శనమిస్తుంది.అయినా కూడా నెగిటివ్ కామెంట్లు బాగా ఎదుర్కొంటుంది.
ఇక అవన్నీ పట్టించుకోకుండా నిహారిక తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.అయితే గత కొన్ని రోజుల నుండి నిహారిక సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినట్లు కనిపించడం లేదు.
గత ఏడాది తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఆ తర్వాత కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మళ్లీ ఏ ఒక్క పోస్టు కూడా చేసినట్లు కనిపించలేదు.
ఇటీవలే తన అన్న వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా కూడా విష్ చేసినట్లు కనిపించలేదు.
దీంతో నిహారికకు ఏమయ్యింది అని.మళ్లీ సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంది అని అనుమానాలు వస్తున్నాయి.
ఇక కొందరేమో లోలోపల మళ్ళీ ఏవైనా గొడవలు వస్తున్నాయా అని అనుమానం పడుతున్నారు.
చివరి శ్వాస వరకు బీజేపీ కోసం పనిచేస్తా..: కిషన్ రెడ్డి