ఎన్టీఆర్ నీల్ కాంబోలో ఆమే హీరోయిన్ అట !

టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

తన అందచందాలతో కుర్రకారు మదిలో తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకుంది.

బాలీవుడ్ లో తన కెరీర్ న ప్రారంభించి తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే మొదటి రెండు సినిమాలు ఈ అమ్మడికి అంతగా పేరు తెచ్చి పెట్టలేదు.

తనకు ఇంకా అవకాశాలు రావు అనుకుంటున్నా సమయంలో చాలా గ్యాప్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ మన ముందుకు వచ్చింది.

ఈ సినిమాతో తన కెరీర్ లో మొదటి హిట్ అందుకుంది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి యూత్ లో ఫాలోయింగ్ పెరి పోయింది.

ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడంతో అందరి ద్రుష్టి నిధి అగర్వాల్ మీద పడింది.

అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరొక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ అమ్మడి పేరు వినిపిస్తుంది.

"""/"/ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇందులో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ పేరు వినిపిస్తుంది.ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో నిధి అగర్వాల్ అయితే బాగుటుందని మేకర్స్ అనుకుంటున్నారట.

"""/"/ చూడాలి మరి మేకర్స్ చివరకు ఎవరిని ఫిక్స్ చేస్తారో.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇది కూడా పూర్తి అయినా తర్వాతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.

అటు నీల్ కూడా ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు.

ఆ వ్యాక్సిన్ వల్లే పునీత్ రాజ్ కుమార్ మరణించారంటూ ప్రచారం.. నిజమేంటంటే?