రాష్ట్రానికి కొత్త రైలు మార్గం…!

నల్లగొండ జిల్లా:డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా నల్లగొండ వయా గద్వాల్ వరకు 296 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసింది.

దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్ శివారు, కుసుమంచి,పాలేరు,మోతె,సూర్యాపేట,నల్లగొండ, కల్వకుర్తి,నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మించనున్నారు.

ఈ లైన్ నిర్మాణం కోసం కేంద్రం రూ.5,330కోట్ల బడ్జెట్ కేటాయించనుంది.

దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ నుంచి షాకింగ్ అప్ డేట్.. ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవుగా!