భారతీయ బ్యాంకులకు కొత్త తలనొప్పి.. అటాక్ చేస్తున్న ఆండ్రాయిడ్ మాల్వేర్..
TeluguStop.com
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా, దాని వల్ల సమస్యలు అంతే స్థాయిలో ఉత్పన్నమవుతున్నాయి.
సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త మాల్వేర్ సృష్టించి, అందరినీ టెన్షన్ పెడుతున్నారు.తాజాగా డ్రినిక్ అనే ఆండ్రాయిడ్ మాల్వేర్ వల్ల భారతదేశంలోని 18 బ్యాంకులు ప్రభావితం అయ్యాయి.
డ్రినిక్ మాల్వేర్ అప్గ్రేడ్ వెర్షన్ దేశంలోని 18 బ్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు సైబుల్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (CRIL) తన నివేదికలో పేర్కొంది.
డ్రినిక్ మాల్వేర్ మొదటిసారిగా 2016లో SMS స్టీలర్గా గుర్తించబడింది.ఆగస్టు 2021లో డ్రినిక్ మళ్లీ యాక్టివ్గా ఉన్నట్లు గమనించబడింది.
ఒక నెల తర్వాత, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) భారతీయ పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకున్న మాల్వేర్ గురించి హెచ్చరించింది.
27 బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు ప్రమాదం ఉందని పేర్కొంది.సెప్టెంబర్ 2021లో, మొబైల్ అప్లికేషన్లు, ఫిషింగ్ ఇమెయిల్లు, స్మిషింగ్ ద్వారా పన్ను చెల్లింపుదారులను ఈ మాల్వేర్ లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది.
డ్రినిక్ కొత్త వెర్షన్ ఏపీకే ఫైల్తో ఎస్ఎంఎస్ పంపడం ద్వారా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటుంది.
ఫైల్లో IAssist అనే అప్లికేషన్ ఉంది.ఇది ఆదాయపు పన్ను శాఖ యొక్క పన్ను నిర్వహణ సాధనాన్ని అనుకరిస్తుంది.
ఆండ్రాయిడ్ ఫోన్లో IAssistని ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఎస్ఎంఎస్ స్వీకరించడం, ఎస్ఎంఎస్ చదవడం, ఎస్ఎంఎస్ పంపడం, కాల్ లాగ్లను చదవడం వంటి చర్యలను అనుమతించాలని యూజర్లను యాప్ అడుగుతుంది.
దీని తర్వాత IAssist గూగుల్ ప్లే ప్రొటక్ట్ని నిలిపివేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో యాక్సెసిబిలిటీ సేవను ఉపయోగించడానికి అనుమతించమని కూడా వినియోగదారులను అడుగుతుంది.
"""/"/
"ఇది స్క్రీన్ రికార్డింగ్ను ప్రారంభించడానికి, గూగుల్ ప్లే ప్రొటెక్ట్ను నిలిపివేయడానికి, ఆటో-డైరెక్షన్స్ అమలు చేయడానికి, కీ లాగ్లను క్యాప్చర్ చేయడానికి అవసరమైన అనుమతులను పొందడానికి సేవను దుర్వినియోగం చేస్తుంది" అని CRIL తన నివేదికలో పేర్కొంది.
బ్యాంకు ఖాతాదారుల పాన్, ఆధార్ తదితర వివరాలు సేకరించి, తద్వారా సైబర్ మోసాలకు మాల్వేర్ కారణమవుతోందని తేలింది.
కేరళను కుదిపేసిన కారులో హీరోయిన్ పై లైంగిక దాడి…. ఎన్నెళ్ళయిన దొరకని న్యాయం