ప్రధాని మోదీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ భేటీ అయ్యారు.

ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఇతర దేశాల అధినేతలు హాజరైయ్యారు.

ఈ క్రమంలో ఇవాళ సదస్సు ప్రారంభంకాగా.మోదీతో రిషి సునాక్ సమావేశం అయ్యారు.

అయితే, జీ20 సదస్సులో భాగంగా భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు రేపు జరగనున్నాయని సమాచారం.

రిషి సునాక్ భారత సంతతికి చెందిన వ్యక్తి.భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టడంతో భారత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను వాడితే స్పాట్ లెస్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం!