నిరుపేద యువతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన నేవూరి వెంకట్ రెడ్డి

ఇప్పటివరకు 1236 కుటుంబాలకు పుస్తె మట్టెలు అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గంగనోల్ల రవికుమార్- శోభల ఏకైక కుమార్తె అయిన ప్రియాంక (20) వివాహానికి నేవూరి వెంకట్ రెడ్డి పుస్తె మట్టెలు అందజేశారు.

ప్రియాంక మెదక్ జిల్లా మమ్మోజి పల్లె గ్రామానికి చెందిన ఎర్ర కృష్ణ-పద్మ గార్ల ఏకైక పుత్రుడు శివ కుమార్ తో నేడు వివాహం జరగనుంది.

వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం.ఈ విషయాన్ని నేవూరి వెంకట్ రెడ్డికి తెలుపగా వెంటనే స్పందించి తన మిత్రుడు అయినటువంటి కొమిరిశెట్టి శెట్టి తిరుపతి పటేల్ తో పుస్తె మట్టెలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గంభీరావుపేట మండల అధ్యక్షులు మొహమ్మద్ హమిద్, గ్రామ శాఖ అధ్యక్షులు సంతోష్, మాజీ ఎంపీటీసీ నాగభూషణం, పోజం భూమరాజు, గద్దల గణేష్, బిట్ల దేవయ్య, పద్మా రెడ్డి, చిన్న ఎల్లారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నేను ఉద్యోగం కోల్పోవడానికి అసలు కారణమిదే.. మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు!