మేజర్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన శేష్!
TeluguStop.com
అడివి శేష్ ప్రధానపాత్రలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్.
ముంబై దాడులలో దేశరక్షణ కోసం ఆఖరి క్షణం వరకు పోరాడుతూ టెర్రరిస్టుల దాడిలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.
ఇక ఈ సినిమా మొదటి షో నుంచి విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకొని అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.
ఇకపోతే ఈ సినిమా విడుదలైన రోజే కమల్ హాసన్ విక్రమ్ సినిమా కూడా విడుదలైంది.
ఈ రెండు సినిమాలు పోటాపోటీగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టాయి.ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.
ఇకపోతే తాజాగా మేజర్ సినిమా గురించి ఒక నెటిజన్ హీరో అడివి శేష్ కి కామెంట్ చేశారు.
అయితే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా నెటిజన్ కామెంట్ చేస్తూ నేను కమల్ హాసన్ గారికి పెద్ద అభిమానిని.
అయితే మేజర్ విక్రమ్ సినిమాలలో ముందు ఏ సినిమా చూస్తారు అని నన్ను అడిగితే నేను మేజర్ సినిమా చూస్తాను అని అనంతరం విక్రమ్ చూస్తానని చెబుతాను.
"""/" /
ఈ విధంగా కమల్ హాసన్ అభిమాని ముందుగా తమ అభిమాన నటుడు నటించిన సినిమా కాకుండా మేజర్ సినిమా చూస్తాను అంటూ కామెంట్ చేయడంతో ఈ ట్వీట్ పై అడివి శేష్ స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన రిప్లై ఇస్తూ నేను కూడా కమల్ హాసన్ గారికి పెద్ద అభిమానిని.
రెండు సినిమాలు తప్పకుండా చూడండి అంటూ సమాధానం ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఖడ్గం సినిమా విషయంలో ఈ ఒక్క లోటు ఎప్పటికి ఎందుకు ఉంది ?