Neha Shetty : టిల్లు స్క్వేర్ లో అలాంటి పాత్రలో నేహా శెట్టి.. ఫ్యాన్స్ కి పండగే?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్.

ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.గతంలో విడుదలైన డిజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగావంశీ నిర్మించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు,పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే.దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది.

"""/" / ఆ సంగతి పక్కన పెడితే డీజే టిల్లు సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి( Neha Shetty ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

డీజే టిల్లు సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఆ సినిమాలో రాధిక అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా విడుదల తర్వాత చాలామంది రాధిక అని పిలవడం కూడా మొదలుపెట్టారు.

కానీ ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ సినిమాలో మాత్రం అనుపమ హీరోయిన్( Anupama Parameswaran ) గా నటిస్తోంది.

అయితే నేహా శెట్టి హీరోయిన్గా చేసి ఉంటే బాగుండేది అని ఆమె అభిమానులు ఎంతో ఆశపడ్డారు.

కానీ ఈ విషయంలో వారికి నిరాశ ఎదురయ్యింది. """/" / ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎంట్రీ తప్పకుండా ఉంటుందట.

కొద్దిసేపు టిల్లు స్క్వేర్ సినిమాలో రాధిక సందడి చేయబోతుందని తెలుస్తోంది.ఒక స్పెషల్ పాత్రలో నేహా శెట్ట నటించబోతున్నట్టు తెలుస్తోంది.

కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే నేహా శెట్టి అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

కదా ఈ వార్త సోషల్ మీడియాలో వేరే లెవ్వడంతో ఏం.రాధిక.

ఇంకా.మాటిల్లు గాడిని వదల లేదా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?