చరణ్‌తో అది కావాలంటోన్న బ్యూటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీలో మెగా వారసుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్‌ను ఫుల్ మాస్ యాంగిల్‌లో చూపించడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ఇక ఈ సినిమాతో చరణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్‌కు జనాలు ఫిదా అయ్యారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ అందాల ఆరబోతకు అప్పట్లోనే ప్రేక్షకులు ఫుల్ ఖుషీ చేసుకున్నారు.

చరణ్‌తో కలిసి ఆమె చేసిన రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉండటంతో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తాయని అనుకున్న నేహా శర్మ, ఆ తరువాత కుర్రాడు అనే సినిమాలో నటించింది.

ఆ తరువాత వరుసగా బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చి పడటంతో ఇక్కడ బిచాణా ఎత్తేసింది.

అటుపై కేవలం బాలీవుడ్‌లోనే ఆఫర్లు సాధిస్తూ దూసుకుపోయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కించింది.

నేహా శర్మ సినిమాలకంటే కూడా ఆమె అందాల ఆరబోతకే అభిమానులు ఎక్కువున్నారంటే అతిశయోక్తి కాదు.

మరి అంతలా అందాల ఆరబోతతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో నటించాలని కోరుకుంటోంది.

తనకు పేరు తెచ్చిన చిరుత సినిమా సీక్వెల్‌లో నటించాలని ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

మరి పూరీ జగన్నాథ్ చిరుత చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తాడా, కనీసం ప్లాన్ చేస్తాడా అనేది సందేహమే అని చెప్పాలి.

నాని రాజమౌళి కాంబినేషన్ రిపీట్ కానుందా.. ఈగ సీక్వెల్ ను అలా ప్లాన్ చేశారా?