Venkatesh Balakrishna : వెంకటేష్ చేతిలో దారుణంగా మోసపోయిన బాలయ్య బాబు.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకే జనరేషన్‌కు చెందిన వీళ్లిద్దరు పలు మార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు.

ఇప్పటికీ ఈ ఇద్దరు హీరోలు వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.అంతా బాగానే ఉంది కానీ ఒక సినిమా విషయంలో వెంకటేష్( Venkatesh ) చేతిలో బాలయ్య దారుణంగా మోసపోయారు.

ఒక తరహా కథతో 34 యేళ్ల క్రితం బాలయ్య, వెంకటేష్‌లు పోటీ పడ్డారు.

వీళ్లిద్దరు దాదాపు ఒకే తరహా కథను చేయడమే కాదు ఆ సినిమాలను ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో రిలీజ్ చేసారు.

ఈ రెండు సినిమాలు విడుదలై 34 యేళ్లు పూర్తయ్యాయి. """/" / ఆ సినిమాలు అశోక చక్రవర్తి, ధృవనక్షత్రం.

అశోక చక్రవర్తి సినిమా విషయానికొస్తే.బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

ఈ సినిమాను ఎస్.ఎస్.

రవిచంద్ర డైరెక్ట్ చేసారు.ముంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1989 జూన్ 29న విడుదలైంది.

అలాగే వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువనక్షత్రం( Dhruva Nakshatram ) సినిమా కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వై.

నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ సినిమా కూడా దాదాపు మలయాళ సూపర్ హిట్ ఆర్యన్ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు.

"""/" / ఈ సినిమాను కూడా 1989 జూన్ 29న 34 యేళ్ల క్రితం విడుదలైంది.

బాక్సాఫీస్ బరిలో వెంకటేష్ హీరోగా నటించిన ధృవనక్షత్రం సినిమా సూపర్ హిట్ అవ్వగా బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి ( Ashoka Chakravarthy )బాక్సాఫీస్ బరిలో యావరేజ్‌తో సరిపెట్టుకుంది.

అలా బాలయ్య బాబు వెంకటేష్ బాక్సాఫీస్ బరి లోకి దిగినప్పుడు వెంకటేష్ మూవీ సక్సెస్ అవ్వగా బాలయ్య బాబు నటించిన మూవీ పరవాలేదు అనిపించింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, మంగళవారం 2024