గంటసేపు ఆ పని చేశానంటున్న నయనతార.. ఎందుకో తెలుసా?

తమిళంలో లేడీ స్టార్ బ్యూటీ నయనతారకు ఉన్న క్రేజ్ మరే ఇతర హీరోయిన్‌కు లేదనే చెప్పాలి.

ఆమె సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు థియేటర్లవైపు పరగులు పెడతారు.తమిళంలో దాదాపు అందరు స్టార్స్‌తో నటించేసిన ఈ బ్యూటీ ఇటీవల జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

తాను ఆ రోజు గంట సేపు నిర్విరామంగా ఆ పని చేశాననడంతో ఏంటా పని అంటూ కోలీవుడ్ వర్గాలు ఆతృతగా చూశాయి.

నయనతారకు తన మేనకోడలు ఏంజెలీనా అంటే చాలా ఇష్టం.ఆమెను తన అదృష్టంగా భావించే నయన్, ఎక్కడికి వెళ్లినా తోడుగా ఆమెను తీసుకెళ్తుందట.

అయితే ఇటీవల క్రిస్మస్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన నయన్, ఆ సమయంలో తన మేనకోడలిని తనతో పాటు తీసుకెళ్లలేకపోయింది.

దీంతో ఆమె తన వెంట లేదని నయన్ గంట సేపు వెక్కివెక్కి ఏడ్చిందని తెలుస్తోంది.

నయన్ మరీ ఇంత ఎమోషనల్ వ్యక్తా అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఏదేమైనా తనకు అదృష్టం అనిపించే తన మేనకోడలు ఆమెతో లేకపోవడంతో నయన్ ఏకధాటిగా గంటసేపు ఏడ్చిందనే వార్త కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక సినిమాల పరంగా నయన్ ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి దర్బార్ చిత్రంతో మనముందుకు వచ్చింది.

ప్రస్తుతం నెట్రికన్ అనే సినిమాలో నయన్ నటిస్తోంది.

ఊహించని యాక్టర్లతో జతకట్టి షాకిచ్చిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..