శ్రీవారి సన్నిధిలో నయనతార జంట.. అందుకోసమే పూజలు చేస్తున్నారా?

నయనతార ప్రెసెంట్ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.

అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

ఈ లేడీ సూపర్ స్టార్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.ఎక్కడకు వెళ్లిన కూడా ఒకరిని విడిచి ఒకరు వదిలి వెళ్లకుండా ఇద్దరు కలిసి తిరుగుతూ ఎప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

అవి కాస్త నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతూ ఉంటాయి. """/"/ ఇక తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన కాతు వాకుల రెండు కాదల్ ఈ రోజు తెలుగు మరియు తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించారు.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై వరుస అప్డేట్ లను ఇస్తూ మరిన్ని అంచనాలను పెంచేశారు.

"""/"/ ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయినా సందర్భంగా ఈ ప్రేమ జంట తిరుమల లో ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తుంది.

ఈ రోజు రిలీజ్ అయినా ఈ సినిమా విజయం కోసం నయనతార తో పాటు ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ కలిసి తిరుమల తిరుపతి సన్నిధానంలో పూజలు చేసి అనంతరం దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ రోజు తెల్లవారు జామున వీరు శ్రీవారి సన్నిధిలో పూజలు చేసినట్టు తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.

వామ్మో.. కార్ క్యాబిన్ ఓపెన్ చేయగా దిమ్మ తిరిగే సీన్..