'జాతి రత్నాలు' రెండవ వారం పరిస్థితి ఏంటీ? ఉప్పెనకు ఇంకా ఎంత దూరం ఉందంటే!

నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో మహా నటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు సినిమా మొదటి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది.

మొదటి మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించినట్లుగా అధికారికంగా మేకర్స్ నుండి ప్రకటన వచ్చింది.

ఆ తర్వాత మాత్రం వసూళ్ల విషయంలో ఎలాంటి ప్రకటన రావడం లేదు.కాని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కు చేరు అయినట్లుగా తెలుస్తోంది.

పెద్ద ఎత్తున వచ్చిన ఈ సినిమా వసూళ్లతో నిర్మాతలు మరియు బయ్యర్లు పెద్ద ఎత్తున లాభాలను దక్కించుకున్నాడు అంటున్నారు.

ఇక రెండవ వారంలో ఈ సినిమా ఏ మేరకు రాబడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా ఏ మేరకు రాబడుతుంది అనే విషయమై ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది.

నేడు ప్రేక్షకుల ముందుకు చావు కబురు చల్లగా మరియు మోసగాళ్లు సినిమా విడుదల అయ్యింది.

కనుక జాతి రత్నాల కు ఏమైనా వసూళ్లు తగ్గేనా అనేది చర్చనీయాంశంగా ఉంది.

భారీ అంచనాలున్న చావు కబురు చల్లగా సినిమా కలెక్షన్స్ నిరాశ జనకంగా ఉన్నాయి.

దాంతో ఈ సినిమా మరింత సక్సెస్ ఫుల్‌ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

అంటే ఈ వారంలో కూడా జాతి రత్నాలు సినిమా పది నుండి పదిహేను కోట్ల వరకు గ్రాస్‌ ను రాబట్టే అవకాశం ఉంది.

అందుకే ఈ సినిమా వసూళ్లు రికార్డు స్థాయిలో ఉంటాయని అలాగే లాభాలు లకూడా అదే రేంజ్‌ లో ఉంటాయని అంటున్నారు.

నవీన్‌ పొలిశెట్టితో పాటు దర్శకుడు అనుదీప్ కూడా ఈ సినిమా తర్వాత పెద్ద ఆఫర్లను దక్కించుకుంటున్నారు.

దాంతో వీరి పారితోషికాలు కూడా పెరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ చేసే ఈ మూడు సినిమాల్లో ఏది బ్లాక్ బస్టర్ అవుతుందంటే..?