జాతీయ యువజన దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161 వ జయంతి సందర్బంగా (జాతీయ యువజన దినోత్సవం పట్టణం లో యువ రన్ (2కె)జగిత్యాల బస్టాండ్ నుండి అమరవీరుల స్థూపం వరకు నిర్వహించడం జరిగింది అని యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు.

ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ యువత కు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద అని, నాటికీ నేటికీ, భవిష్యత్తు తరాలకు ఆయన అందించిన మార్గం యువతకు ఆదర్శం అని, యువత అనుకుంటే సాధించలేనిది ఏది లేదని, భారత దేశ కీర్తి ని పెంచిన గొప్ప వ్యక్తి అని, వివేకానంద ను స్ఫూర్తి గా తీసుకొని యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలి అని, భవిష్యత్తు తరాలకు వివేకానంద సూక్తులు, ఆయన చూపిన మార్గం తెలియజేయటానికి ప్రతీ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్,విశాల్ కుమార్,మధు, రాజు,మధు, వినయ్, యువ ఫౌండేషన్ అభ్యర్థులు వినయ్, గంగరాజు, మధు, రాజు, రాహుల్, అర్జున్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

దేవర సెప్పినాడంటే చేస్తాడని.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమాల్లో నటిస్తున్నాడుగా!