కార్గిల్ విజయోత్సవాల్లో జాతీయస్థాయిలో కోదాడ విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట జిల్లా: భారతీయ సైనిక దళం 25 ఏళ్ల కార్గిల్ విజయోత్సవాల దృష్ట్యా పాఠశాల విద్యార్థులకు జాతీయ స్థాయిలో బ్యాటిల్ ఆఫ్ మైండ్స్ పేరుతో ఢిల్లీలోని సమ్ మణికేహస్ ఆడిటోరియంలో జరిగిన ఫైనల్ పోటీలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ తేజ టాలెంట్ స్కూల్ 8వ తరగతి విద్యార్థుల జట్టు ప్రతిభ కనబరిచారు.

పోటీలో 32,441 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.గత రెండు నెలలుగా వివిధ వడపోతల ద్వారా అత్యుత్తమ 12 జట్లను ఎంపిక చేశారు.

ఫైనల్ పోటీలో కోదాడ విద్యార్థులు 6వ స్థానం సాధించారు.విజేతలకు 2లక్ష 90వేలు సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్ రమాదేవి, క్విజ్ మెంటర్ గా వ్యవహరించిన సోమిరెడ్డి తదితరుల చేతుల మీదుగా అందుకున్నారు.

మాయమాటలతో హనీ ట్రాప్ చేస్తున్న జాయ్ జెమీమా