నరేష్,స్వాతి పరువు హత్య కేసులో తీర్పు వెలువరించిన కోర్టు

యాదాద్రి జిల్లా: ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్,స్వాతి పరువు హత్య కేసుపై బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ కేసులో నిందితులుగా స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి ఏ1గా,ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డి ఏ2గా ఉన్నారు.

కేసు విషయమై న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్,డిఫెన్స్ తుది వాదనలు ఈనెల 9న పూర్తి కావడంతో బుధవారం కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నిర్దోషిగా తీర్పునిచ్చింది.

2017లో జరిగిన ఈ కేసులో 2018 జులై 31న కేసు అభియోగపత్రాలు పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు.

23 మంది సాక్షుల విచారణతోపాటు భౌతిక ఆధారాలు,ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు.

సంచలనం సృష్టించిన హత్య కేసులో సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా తీర్పును వెలువరించింది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Argentina