అమరావతిని కృష్ణమ్మ ముంచేయడం కాదు, అసెంబ్లీని జనాలు ముంచెత్తారు

రాజధాని వికేంద్రీకరణ విషయమై నేడు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చిన విషయం తెల్సిందే.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు అంతా కూడా అసెంబ్లీని ముట్టడించేందుకు సిద్దం అయ్యారు.

ఇప్పటికే పలు ప్రాంతాల నుండి అసెంబ్లీ వైపుగా జనాలు తరలి వచ్చారు.పోలీసులు వారిని ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్‌లు చేస్తూ జనాలు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

పెద్ద ఎత్తున జనాలు ప్రస్తుతం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అసెంబ్లీకి ఒక వైపు నుండి జనాలు పోలీసుల రక్షణ వలయంను ఛేదించి అసెంబ్లీ వైపుగా దూసుకు వెళ్లారు.

ఆ వీడియోలను మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.అమరావతిని కృష్ణమ్మ ముంచెత్తుతుందని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారం చేసారు.

ఇప్పుడు నిజంగా ఈ జనప్రవాహం అసెంబ్లీ ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని చూడండి.మహిళలు, పిల్లలు సైతం ప్రభుత్వ నిర్బంధనాలను చేధించుకుని ఎలా వెల్లువెత్తారో చూసాక కూడా ప్రభుత్వం మొండి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వం కాదా? అంటూ వీడియోకు లోకేష్‌ కామెంట్‌ పెట్టాడు.

వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్..!