నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు విరామం..!!

టీడీపీ నేత నారా లోకేశ్ చేస్తున్న ‘యువగళం’ పాదయాత్రకు విరామం ఇచ్చారు.ఏపీలో ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలోని కంటేవారిపల్లి బస ప్రాంతం నుంచి వెళ్లిపోనున్నారు లోకేశ్.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల వినతితో లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత లోకేశ్ తిరిగి ఇదే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వామ్మో, రూ.9 కోట్లకు అమ్ముడైన ఆ బ్యాంక్ నోట్లు.. ఎందుకంటే..?