రేపు సీఐడీ విచారణకు నారా లోకేశ్
TeluguStop.com
టీడీపీ నేత నారా లోకేశ్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు.ఈ మేరకు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన రేపు ఉదయం విజయవాడకు రానున్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు విచారణలో భాగంగా సీఐడీ ఎదుట లోకేశ్ హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 30న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఆర్పీసీ 41 (ఏ) కింద అధికారులు నోటీసులు ఇచ్చారు.
కాగా విచారణలో భాగంగా కీలక విషయాలపై లోకేశ్ ను సీఐడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది.
ఈ క్రమంలో లోకేశ్ కు సీఐడీ పలు ప్రశ్నలు సంధించనుంది.కేసుకు సంబంధించిన వాస్తవాలను ప్రశ్నించడానికి తమ వద్ద సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.
కాగా ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ14గా పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. సత్యభామతో ఆ కోరిక తీరింది: కాజల్