మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన నారా లోకేశ్

టీడీపీ నేత నారా లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం ఆరోపణల కేసు విచారణలో భాగంగా మంగళగిరి కోర్టులో నారా లోకేశ్ వాంగ్మూలం ఇచ్చారు.

అయితే తనకు సంబంధం లేని అంశంతో ఆరోపణలు చేశారంటూ అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డికి లోకేశ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

సమాధానం రాకపోవడంతో తన పరువుకు భంగం కలిగించారని అజయ్ రెడ్డిపై చర్యలు కోరుతూ నారా లోకేశ్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు.

కాగా మంగళగిరి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇవ్వనున్న నేపథ్యంలో నారా లోకేశ్ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పైనాపిల్ షేక్ తో ఆరోగ్యం అందం రెండు మీ సొంతం!