జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం..: ఎంపీ రామ్మోహన్ నాయుడు
TeluguStop.com

ఏపీ ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.


25 ఎంపీలను ఇస్తే హోదా తెస్తామని చెప్పి జగన్ మాట తప్పారని విమర్శించారు.


ప్రజలకు ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదని చెప్పారు.జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం పూరించారన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తుతామని తెలిపారు.