రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఎన్నాళ్లు హైదరాబాద్ ని రాజధానిగా చూస్తారంటూ ప్రశ్నించారు.బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి ఉపాధి కోసం వెళ్తాం.

మనకి పౌరుషం లేదా.? ఆత్మగౌరవం లేదా.

? ఆత్మవిశ్వాసం లేదా.? రాజధాని నిర్మించుకోలేమా.

? పక్క రాష్ట్రాల యువత ఏపీకి వచ్చి ఉద్యోగాలు చేసేలా పరిశ్రమలు తీసుకురాలేమా.

? 62 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ ( Hyderabad ) అభివృద్ధి చేసుకున్నాం.

అలాంటి రాజధాని మళ్లీ కట్టుకుందాం.హైదరాబాదులో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

అదే పరిస్థితి మన రాష్ట్రంలో కల్పించుకుందాం.ఆ దిశగా అందరం అడుగులు వేద్దాం.

అప్పుడు ఇతర రాష్ట్రాల నుండి ఏపీలో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. """/" / ఈ క్రమంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని( NDA Alliance ) గెలిపించాలని లోకేష్ అభ్యర్థించడం జరిగింది.

ఏపీలో ఎన్నికలకు( AP Elections ) ఇంకా పది రోజులు కూడా సమయం లేదు.

మే 13వ తారీకు పోలింగ్.దీంతో నారా లోకేష్ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఈసారి కూడా మంగళగిరి నియోజకవర్గం( Mangalagiri ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికలలో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని లోకేష్ భావిస్తున్నారు.దీంతో మంగళగిరి నియోజకవర్గంలో మొన్నటివరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడపడం జరిగింది.

అనంతరం ఇప్పుడు యువగళం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.శనివారం రాజంపేటలో.

యువగళం నిర్వహించడం జరిగింది.