జగన్ ప్రభుత్వం పై నారా బ్రాహ్మణి సీరియస్ వ్యాఖ్యలు..!!

చంద్రబాబు( Chandrababu ) అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తూ రాజమండ్రిలో మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి( Nara Brahmani ) మాట్లాడుతూ.చంద్రబాబు లాంటి సీనియర్ మరియు విజనరీ నాయకుడును.

అన్యాయంగా అరెస్టు చేశారు.కనీసం ఎలాంటి ఆధారాలు లేకుండా.

అరెస్టు చేయటం జరిగింది.అభివృద్ధి, సంక్షేమం ఇంకా దేశానికి ఐటీ తీసుకొచ్చి చాలామంది యువతి యువకులకు ఉపాధి కల్పించింది చంద్రబాబు.

ప్రస్తుత ప్రభుత్వం యువతకు గంజాయి, లిక్కర్ తప్ప ఏమి ఇస్తుంది.ఇటువంటి క్లిష్ట సమయంలో మాకు మద్దతు తెలుపుతున్న జాతీయ నాయకులకు ఐటీ ఉద్యోగులందరికీ నా ధన్యవాదాలు.

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి కీలక నాయకుడికి ఇటువంటి పరిస్థితి.ఏర్పడితే.

రేపు రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఇంకా ఏంటి అని ప్రశ్నించారు.లోకేష్ ఒకచోట మేము ఒకచోట తిరుగుతున్నాం.

నాలాంటి యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వటమే చంద్రబాబు చేసిన తప్ప.లోకేష్ ( Lokesh ) ను కూడా అరెస్టు చేస్తారేమో.

అని అనుమానం వ్యక్తం చేశారు.రిమాండ్ రిపోర్టు చదివితే ఎనిమిదేళ్ల దేవాన్ష్ అయినా అందులో ఏమి తప్పు లేదని చెబుతాడు.

మేము ఒంటరి వాళ్ళం కాదు.మా వెనకాల తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంది.

అంటూ నారా బ్రాహ్మణి జగన్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

కృతిశెట్టి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేసిందా.. ఏమైందంటే?