నాని, రానా హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ… సురేష్ ప్రొడక్షన్ లోనే

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ కాంబినేషన్ కథలు ఎక్కువగా సిద్ధమవుతున్నాయి.స్టార్ హీరోల నుంచి మినిమం రేంజ్ హీరోల వరకు అందరూ మల్టీ స్టారర్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

కథలో దమ్ముంటే తాము చేయడానికి రెడీ అంటున్నారు.అవసరం అయితే నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు అయినా పరవాలేదని చెప్పేస్తున్నారు.

దీంతో దర్శకులకి కూడా కాస్తా ఫ్రీ హ్యాండ్ దొరికి మంచి కథలని సిద్ధం చేస్తున్నారు.

ఇప్పుడు తెలుగులో ఆర్ఆర్ఆర్ నుంచి ఆచార్య వరకు అరడజనుకి పైగా మల్టీ స్టారర్ కథలు సెట్స్ పై ఉన్నాయి.

ఇప్పటికే వెంకీమామ, తాజాగా వి లాంటి మల్టీ స్టారర్ మూవీలు రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోలలో నాని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

నాని ఎక్కువగా మల్టీ స్టారర్ కథలపై ఆసక్తి చూపిస్తున్నాడు.దేవదాస్ సినిమాలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న నాని, తాజాగా వి సినిమాతో సుదీర్ బాబుతో స్క్రీన్ పంచుకున్నాడు.

అయితే నానికి ఈ రెండు సినిమాలు చేదు ఫలితాన్నే అందించాయి.అయినా కూడా మరోసారి మల్టీ స్టారర్ కి నాని సిద్ధమయ్యాడు.

అది ఇండస్ట్రీకి తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన దగ్గుబాటి రానాతో కలిసి చేయడానికి ఒకే చెప్పాడు.

రానా ఇప్పటి వరకు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న విలన్ పాత్రలలో కనిపించాడు.

అయితే తొలిసారి హీరోలుగా ఈ కాంబినేషన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద మ్యాజిక్‌ చేయబోతోంది.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట.త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

వైరల్ వీడియో: ఇలా ట్రై చేయండి పైసా అవసరం లేకుండా చల్లటి నీటిని తాగేయొచ్చు..