జనసేన పార్టీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి

టీడీపీ పార్టీ నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎస్పీవై రెడ్డి చంద్రబాబుకి ఊహించని విధంగా జలక్ ఇచ్చారు.

నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలబడాలని భావించిన అతనికి చంద్రబాబు సీటు ఇవ్వలేదు.

దీంతో కొంత అసంతృప్తిగా ఉన్న ఎస్వీవై రెడ్డి టీడీపీ రెబల్ గా బరిలో దిగాలని ప్లాన్ చేసారు.

అయితే ఊహించని విధంగా జనసేన పార్టీ అధిష్టానం అతనితో సంప్రదింపులు జరిపారు.ఈ నేపధ్యంలో తాజాగా జనసేన పార్టీలో ఎస్పీవై రెడ్డి చేరారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతను తాను ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఎన్నికలలో పోటీ చేయడం లేదని, జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు.

అయితే జనసేన పార్టీ నుంచి ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల కి నంద్యాల టికెట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

వలసదారుల సంక్షోభం .. ఫ్లైటెక్కిన తొలి శరణార్ధి, బ్రిటన్‌ రువాండా ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా .. ?