సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ హిట్.. అలిగిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ బాక్సాఫీస్ రికార్డులను తిరిగి రాయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

దాదాపు 13 ఏళ్ల తరువాత మెగాస్టార చిరంజీవి, విజయశాంతి ఒకే వేదికపై కనబడటంతో వారి అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు.

ఈ కారణంగా సరిలేరు నీకెవ్వరు ఈవెంట్‌లో మహేష్ అభిమానులకంటే చిరు-విజయశాంతిల అభిమానుల సందడే ఎక్కువగా కనిపించడం, సోషల్ మీడియాలో కూడా చిరు-విజయశాంతిలకు సంబంధించన వార్తలే ఎక్కవ ప్రమోట్ కావడంతో మహేష్ భార్య నమ్రత చాలా అప్‌సెట్ అయ్యారట.

మహేష్ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో వీరిద్దరి ప్రమోషన్స్ ఏమిటని ఆమె బాగా ఫీలయ్యిందని తెలుస్తోంది.

కాగా ఈ విషయంపై మహేష్ అండ్ ఫ్యామిలీ కూడా సైలెంట్‌గానే ఉన్నారు.కాగా సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

స్టార్ హీరోయిన్ దెబ్బకు స్టార్ హీరో మూవీ అట్టర్ ఫ్లాప్.. నిండా ముంచేసిందిగా!