భారత్ వాలీబాల్ జట్టులో మెరిసిన నకిరేకల్ వాసి…!

నల్లగొండ జిల్లా:ఇండోనేపాల్ ఇంటర్నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్( Indo Nepal International Volleyball Tournament ) లో భాగంగా ఈ నెల ఏడవ తేదీన జరిగిన ఫైనల్ లో నేపాల్ పై విజయంతో భారత్ బంగారు పతకాన్ని సాధించింది.

విజయ సాధించిన భారత జట్టులో నల్లగొండ జిల్లా నకిరేకల్ నారాయణ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పగిడిమర్రి జానీ( Pagidimarri Johnny ) సభ్యుడిగా ఉన్నాడు.

ఈ సందర్భంగా విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలతో పాటు పగిడిమర్రి జానీకి పాఠశాల డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎంలు శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నరేష్,ఏవో సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ప్రజల అభిప్రాయమిదే.. అలా చేయడం రైట్ కాదంటూ?