భారత్ వాలీబాల్ జట్టులో మెరిసిన నకిరేకల్ వాసి…!

నల్లగొండ జిల్లా:ఇండోనేపాల్ ఇంటర్నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్( Indo Nepal International Volleyball Tournament ) లో భాగంగా ఈ నెల ఏడవ తేదీన జరిగిన ఫైనల్ లో నేపాల్ పై విజయంతో భారత్ బంగారు పతకాన్ని సాధించింది.

విజయ సాధించిన భారత జట్టులో నల్లగొండ జిల్లా నకిరేకల్ నారాయణ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పగిడిమర్రి జానీ( Pagidimarri Johnny ) సభ్యుడిగా ఉన్నాడు.

ఈ సందర్భంగా విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలతో పాటు పగిడిమర్రి జానీకి పాఠశాల డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎంలు శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నరేష్,ఏవో సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.

ఢిల్లీలో ధర్నా : అందరినీ ఏకం చేస్తున్న జగన్