ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్

ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతున్నారని విమర్శించారు.గతంలో పవన్ కల్యాణ్ ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఇప్పుడు కారుకూతలు కూస్తున్నారంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే అది మీ ముఖం మీద పడుతుందని నాగబాబు చెప్పారు.

ఏపీ మంత్రులకు అభివృద్ధికి అర్థమే తెలియదన్నారు.మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బటన్ నొక్కి కోట్లలో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా అన్న నాగబాబు అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగల లేదనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకు ఎండ్ కార్డు పడే రోజు దగ్గర్లోనే ఉందని వెల్లడించారు.

సూర్య కంగువ మూవీ ట్రైలర్ రివ్యూ.. స్టార్ హీరో సూర్య నట విశ్వరూపం చూపించారుగా!