సుబ్రహ్మణ్యపురంలో అడుగు పెడుతున్న హీరో

యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బిజీగా మారాడు.

కాగా వరుసగా సినిమాలు చేస్తున్నా, ఫలితం మాత్రం అంతంత మాత్రంగా వస్తుండటంతో ఈ హీరో సినిమాలు ఎలాంటి కంటెంట్‌తో వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ హీరో నటిస్తున్న సినిమాల్లో ప్రస్తుతం ఓ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

గతంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన సుబ్రహ్మణ్యపురం చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులు వేసినా ఇది కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేదు.

దీంతో ప్రేక్షకులను మెప్పించేందుకు మరోసారి రెడీ అవుతున్నాడు ఈ చిత్ర డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి.

ఇందులో భాగంగా యంగ్ హీరో నాగశౌర్యతో ఓ సినిమా చేసేందుకు ఈ డైరెక్టర్ రెడీ అయ్యాడు.

ఈ సినిమాలో పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించనున్నాడు ఈ డైరెక్టర్.ఆర్చరీ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రేక్షకులను అన్ని విధాలా ఆకట్టుకునేలా ఈ కథను దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌లు జరగకపోవడంతో, పరిస్థితులు చక్కబడ్డాడక ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉన్నా అవి కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కావడం లేదు.

మరి ఈ సినిమాతో నాగశౌర్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన..!