సినిమాగా తెరకెక్కబోతున్న నాగ చైతన్య ‘దూత’ వెబ్ సిరీస్ సీక్వెల్!

రీసెంట్ గా ఓటీటీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ ఏదైనా ఉందా అంటే అది అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన 'దూత' వెబ్ సిరీస్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇది నాగచైతన్య కి మొట్టమొదటి ఓటీటీ సిరీస్.చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య( Naga Chaitanya ) కి ఈ వెబ్ సిరీస్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు.

మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) లో అత్యధిక వ్యూస్ ని దక్కించుకున్న వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచే దిశగా అడుగులు వేస్తుంది.

ఈ సిరీస్ చూసిన ప్రతీ ఒక్కరి ఫీలింగ్ ఏమిటంటే , ఇంత మంచి కాన్సెప్ట్ తో సినిమా తీసి ఉంటే నాగ చైతన్య కి పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ పడుండేది అని అనుకున్నారు.

"""/" / అందుకే ఈ సిరీస్ కి కొనసాగింపు గా రెండవ సీజన్ చేద్దామని అనుకున్నారు కానీ, నాగ చైతన్య మాత్రం సినిమా చేద్దాం అని డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో అన్నాడట.

అందుకే దూత సీక్వెల్ ని సినిమా వెర్షన్ కి రాసుకుంటున్నాడట విక్రమ్.వెబ్ సిరీస్ కంటే ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో స్టోరీ ని సిద్ధం చేసినట్టు టాక్.

వచ్చే ఏడాది ప్రారంభం లోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట.

వెబ్ సిరీస్ లో ఉన్న పాత్రలే సినిమాలో కూడా కనిపిస్తాయి కానీ, కొన్ని క్యారెక్టర్స్ మాత్రం సినిమాలో ఉండవు.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో కామెడీ లెజెండ్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్( Raja Goutham ) నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఆయన పాత్ర మరియు తరుణ్ భాస్కర్ పాత్ర కూడా సినిమా వెర్షన్ లో ఉంటుందని టాక్.

"""/" / ఇది ఇలా ఉండగా నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి అనే దర్శకుడితో 'తండేల్' అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.లవ్ స్టోరీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆమె నాగ చైతన్య తో కలిసి చేస్తున్న చిత్రమిది.

రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.సినిమా కూడా నాగచైతన్య కెరీర్ లో మైల్ స్టోన్ లాగ నిలిచిపోతుందని అంటున్నారు.

పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?