నాగచైతన్య 'థాంక్యూ' సినిమాకు కూడా తగిలిన కరోనా సెగ..!

నాగచైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎంచుకుంటూ తన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.

మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ సినిమా స్టార్ట్ చేసాడు.

శేఖర్ కమ్ములకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఈయన సినిమాలంటే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే విధంగా ఉంటాయి.

ఈయన సినిమాల్లో హీరోయిన్ పాత్ర కేవలం గ్రామర్ రోల్ కు మాత్రమే కాకుండా బలమైన క్యారెక్టర్స్ ఉంటాయి.

ఈ సినిమాలో నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ఏప్రిల్ 16 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.

అయితే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

"""/"/ ఈ సినిమాకు థాంక్యూ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాను విక్రమ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ 15 రోజులు ఇటలీ కి వెళ్లాల్సి ఉండగా ఆ షెడ్యూల్ ను రద్దు చేసుకున్నట్టు సమాచారం.

ఎందుకంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ అంతటా మొదలై పోయింది.అందువల్ల విదేశీ టూర్ ను రద్దు చేసుకుని ఇక్కడే వేరొక షెడ్యూల్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

టమాటా నారు పెంపకంలో పాటించాల్సిన సరైన యాజమాన్య పద్ధతులు..!