నయీం అనుచరుడు శేషన్నకు 14 రోజుల రిమాండ్

గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్న కస్టడీ పూర్తి అయింది.దీంతో ఆయనను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

ఈనెల 7వ తేదీ నుండి 10 వ తేదీ వరకు విచారించిన పోలీసులు.

శేషన్న కస్టడీని రహస్యంగా ఉంచారు.ఈ క్రమంలోనే కస్టడీ పూర్తి కావడంతో శేషన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు శేషన్నను చంచల్ గూడ జైలుకు తరలించారు.నయీం ఎన్ కౌంటర్ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు.

అనంతరం ప్రజలను బెదిరిస్తూ సెటిల్ మెంట్లు నిర్వహిస్తుండే వాడు.ఈ క్రమంలోనే ఓ సెటిల్ మెంట్ కు వచ్చిన శేషన్నను పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

నా కోసం 7/జి బృందావన్ కాలనీ క్లైమాక్స్ మార్చారు : రకుల్ ప్రీత్