'నా కోసం మారావా నువ్వు' అంటున్న నాగ చైతన్య!

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ప్రెసెంట్ బంగార్రాజు సినిమా చేస్తున్నాడు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో నాగార్జున కు జంటగా రమ్య కృష్ణ నటిస్తుండగా.

నాగ చైతన్య కు జంటగా కృతి శెట్టి నటిస్తుంది.ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసిన బంగార్రాజు సినిమా జట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

ఈ క్రమంలోనే బంగార్రాజు టీమ్ అక్కినేని అభిమానులకు వరుస ట్రీట్స్ ఇస్తుంది.ఇప్పటికే నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

ఇక ఇప్పుడు నాగ చైతన్య, కృతి శెట్టి మధ్య వచ్చే సాంగ్ ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేసారు.

'నా కోసం మారావా నువ్వు' అంటూ సాగె ఈ పాట అభిమానులను బాగా ఆకట్టు కుంటుంది.

ఇక ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించడంతో ఈ పాట ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది.

నాగ చైతన్య, కృతి శెట్టి మధ్య వచ్చే అందమైన సాంగ్ ఇది అని తెలుస్తుంది.

"""/"/ అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం శ్రోతలను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యింది.ఇక ఈ ఫుల్ సాంగ్ డిసెంబర్ 5న సాయంత్రం 5.

12 నిముషాలకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.బంగార్రాజు సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న విషయం తెలిసిందే.

నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్నినాయన అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.

"""/"/ ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాను అంతే ఎనర్జిటిక్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్.

ప్రెసెంట్ బంగార్రాజు షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నాగ చైతన్య ఒక పక్క విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' సినిమాను పూర్తి చేస్తూనే మరొక పక్క బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు.. సీఎం రేవంత్