మైత్రి మూవీస్ వారి కన్ను ధమాకా డైరెక్టర్ మీద పడినట్టుందే?
TeluguStop.com
ఒక్క సినిమాకే ఒక్కోసారి జాతకాలు మారుతూ ఉంటాయి.ఇది రంగుల ప్రపంచం కావడంతో హిట్ ఉన్న వారి దగ్గరికే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
మరి ఒక్క హిట్ కొడితే చాలు లెక్క వేరేలా ఉంటుంది.అదే ప్లాప్ పడితే పొగిడిన వారే రివర్స్ అవుతారు.
అవకాశాలు ఇచ్చేవారు కూడా లాగేసుకుంటారు.అందుకే సక్సెస్ కోసం అంతా ప్రాకులాడుతారు.
ఇక సినీ ప్రపంచంలో డైరెక్టర్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది.తాజాగా మన టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి కంట్లో పడ్డాడు ఒక డైరెక్టర్.
ఈ డైరెక్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.అతను ఎవరో కాదు ధమాకా సినిమాతో మాస్ రాజా కెరీర్ లో సాలిడ్ హిట్ అందుకున్న డైరెక్టర్ తినాథరావు నక్కిన.
2013లో వరుణ్ సందేశ్ తో ప్రియాతమా నీవచట కుశలమా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతో ఆకట్టుకోలేక పోయాడు.
ఇక ఆ తర్వాత తనీష్ తో మేం వయసుకు వచ్చాం అనే సినిమాతో యూత్ ఆడియెన్స్ ను కొంతమేర అలరించాడు.
మధ్యలో మరికొన్ని చేసిన రాజ్ తరుణ్ తో చేసిన సినిమా చూపిస్తా మావ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు.
"""/"/
అలా ఒక్కో సినిమా చేసుకుంటూ వచ్చిన తినాథరావు ఇప్పుడు ఏకంగా ధమాకా సినిమాతో 100 కోట్ల ప్రాజెక్ట్ తో వచ్చాడు.
రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇంతటి హిట్ ఇవ్వడంతో ఇప్పుడు త్రినాథరావు నక్కిన టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
ఈ సినిమా హిట్ తో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు ఈయనకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట.
మైత్రి ఆఫర్ అంటే స్టార్ హీరోనే అయి ఉంటాడు.చూడాలి వీరి కాంబోలో హీరో ఎవరు అనేది.
ఈ సినిమా కూడా క్లిక్ అయితే ఇక స్టార్ డైరెక్టర్ అయిపోయినట్టే.
యూత్లో హింసా ప్రవృత్తిని బాగా పెంచేసిన రామ్ గోపాల్ వర్మ మూవీ..